మరోసారి అఖిలపక్షం అవసరం లేదు, మేం దూరం: రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Revuri Prakash Reddy
వరంగల్: తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్రమంత్రి చిదంబరం అఖిలపక్షం ఏర్పాటు చేశారని దానివల్ల ఎలాంటి లాభం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అఖిలపక్షానికి హాజరు కాదని తేల్చి చెప్పారు. జనవరి 6న జరిగిన అఖిలపక్షానికి కూడా మేం దూరంగా ఉన్నామని ఆయన గుర్తు చేశారు. తమకు నివేదిక, అఖిలపక్షంతో సంబంధం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ అంశాన్ని వదిలేసి పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారు పదవుల వ్యామోహం మాని తెలంగాణ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తారీఖునుండి టిడిపి తెలంగాణ కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. కాగా అఖిలపక్షం నిర్వహించడం ద్వారా కేంద్రం తెలంగాణ అంశాన్ని ఇతర పార్టీలపైకి నెట్టాలని చూస్తుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు అఖిలపక్షం నిర్వహించిన కేంద్రం తెలంగాణ అపవాదును రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీపైకి నెట్టడంతో తెలంగాణను టిడిపి అడ్డుకున్నదనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+