హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వల్ల మా పార్టీకి నష్టమేమీ లేదు: గంటా శ్రీనివాసరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
హైదరాబాద్: విశాఖపట్నంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వల్ల తమ పార్టీకి నష్టమేమీ లేదని ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుడు గంటా శ్రీనివాస రావు అన్నారు. పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమావేశమైన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ వల్ల తమ పార్టీ మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు. కొత్త పార్టీ వచ్చినప్పుడు కొంత మంది ఆ పార్టీకి వెళ్లిపోవడం మామూలేనని, దానివల్ల తమకు పెద్దగా నష్టం లేదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వెంట వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వారిపై పార్టీ సమావేశంలో చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని, ఈ సమావేశానికి చిరంజీవి రాబోరని ఆయన చెప్పారు. నియోజకవర్గాల సమస్యలపై, పెట్రోల్ ధర పెంపుపై ముఖ్యమంత్రికి విన్నవిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X