హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదం, రచ్చబండ కార్యక్రమం వేరువేరు: మంత్రులు గీతారెడ్డి, బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమానికి, తెలంగాణ అంశానికి ముడిపెట్టకూడదని మంత్రులు గీతారెడ్డి, బొత్స సత్యనారాయణ బుధవారం వేరువేరు విలేకరుల సమావేశంలో ప్రజలను కోరారు. సోనియాగాంధీ ఆశీస్సులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలవుతాయని బొత్స అన్నారు. పార్టీ పథకాలు కొనసాగించడం మా బాధ్యత అని అన్నారు. రచ్చబండను రాష్ట్రంలో ఎక్కడా అడ్డుకోకూడదని ఆయన ప్రజలకు సూచించారు. రచ్చబండ, తెలంగాణవాదం వేరు వేరు అంశాలని అన్నారు.

రచ్చబండకు, తెలంగాణకు లింకు పెట్టకూడదని మంత్రి గీతారెడ్డి కూడా చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా కలిసి కట్టుగానే ఉన్నారన్నారు. అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి తెలంగాణ అంశంపై వివరిస్తామని చెప్పారు. ఎమ్మార్ వ్యవహారంపై ముఖ్యమంత్రికి అంతా వివరించామని చెప్పారు. ఏపిఐఐసికి ఎలాంటి నష్టం జరగకూడదనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X