కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలోనూ నిర్మాత శింగనమల రమేష్ ఘనకార్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Singamala Ramesh
కడప: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ వ్యవహారాల కూపీ లాగుతుంటే తెలుగు సినీ నిర్మాత శింగనమల రమేష్ వ్యవహారాలు కూడా ఒక్కటొక్కటే బయపడుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో రమేష్ ఘనకార్యాన్ని ఓ ప్రముఖ దినపత్రిక బయటపెట్టింది.అతను కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు బయటపెట్టింది. ఆ వార్తాకథనం ప్రకారం - ప్రొద్దుటూరులో ఫైనాన్సియర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు అప్పు తీసుకున్నట్లు బయటకు పొక్కుతోంది. ప్రొద్దుటూరులో కొందరు పేరుమోసిన వ్యాపారులు రమేష్‌కు రూ.20 కోట్ల మేర అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. కొందరికి రమేష్‌ ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ప్రొద్దుటూరులో ఐదుగురు వ్యక్తులకు రమేష్‌ రూ.30లక్షలు ఇవ్వాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రొద్దుటూరు అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరో ఐదుగురి రూ.16 లక్షలకు సంబంధించి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వీరు కోర్టులో కేసు వేశారు. ఈ న్యాయవాది వద్ద ఎనిమిది చెక్కుబౌన్సు కేసులు ఉన్నాయి. మరో రూ.5 లక్షలకు సంబంధించి రమేష్‌ ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో బాధితులు కోర్టులో మూడు కేసులు వేశారు. వీటన్నంటికీ సంబంధించి రమేష్‌ కు కోర్టు ద్వారా సమన్లు పంపగా ఈయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు తెలిసింది. రమేష్‌ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని చెల్లించకపోవడంతో ఓ వ్యాపారి ప్రొద్దుటూరు కోర్టులో సివిల్‌ కేసు వేశారు. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X