హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదులపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి దాడిని ఖండించిన కోదండరాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణవాదులపై సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి దాడిని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం ఖండించింది. సంగారెడ్డిలో తెలంగాణ కోర్తూ మంత్రులను అడ్డుకున్న తెలంగాణవాదులపై జగ్గారెడ్డి దాడి చేయడం శోచనీయమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణవాదులపై దాడి చేసిన జగ్గారెడ్డిపై మంగళవారం మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సోమవారం సంగారెడ్డిలో పర్యటిస్తామని చెప్పారు. అయితే జగ్గారెడ్డి కెసిఆర్, కోదండరాం సంగారెడ్డి పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు.

రచ్చబండ కార్యక్రమ సమీక్షా సమావేశాలపై శనివారం సంగారెడ్డికి వెళ్లిన మంత్రులు దానం నాగేందర్, సునీతారెడ్డిని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. వారిపై ఎమ్మెల్యే జంగారెడ్డి దాడి చేశారు. తాను తెలంగాణవాదినేనని అయితే రాజీనామా మాత్రం చేయనని అప్పుడే ప్రకటించారు. మరో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచనలమేరకు తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X