కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిందాల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి మృతి, పరిహారంపై ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Zindal Cement Factory
కర్నూలు: కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం బిలకలగూడూరులోని జిందాల్ సిమెంటు ఫ్యాక్టరీలో రాజారాం అనే కార్మికుడు మృతి చెందడంతో పరిహారం విషయమై కార్మికులు ఆందోళన చేశారు. నిర్మాణ పనుల్లో మునిగి ఉన్న రాజారాం ప్రమాదవశాత్తూ కిందపడి మరణించాడు. దీంతో మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యాన్ని ఘెరావ్ చేశారు. సరియైన నష్టపరిహారం మృతుడి కుటుంబానికి చెల్లించాలంటూ కార్మికులు ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

దీంతో రెచ్చిపోయిన కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. కార్మికులు పోలీసుల జీపును ధ్వంసం చేశారు. పోలీసులు కూడా వారిని చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా తాము మృతి చెందిన కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ఎండి అన్నారు. తాము నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ కార్మికులు ఆందోళనకు దిగారన్నారు. మృతుడి కుటుంబీకులతో ఇంకా మాట్లాడలేదని, వారితో చర్చించిన తర్వాత నష్టపరిహారం విషయాన్ని ఎంత ఇవ్వాలో చూస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X