జిందాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి మృతి, పరిహారంపై ఉద్రిక్తత
దీంతో రెచ్చిపోయిన కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. కార్మికులు పోలీసుల జీపును ధ్వంసం చేశారు. పోలీసులు కూడా వారిని చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా తాము మృతి చెందిన కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ఎండి అన్నారు. తాము నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ కార్మికులు ఆందోళనకు దిగారన్నారు. మృతుడి కుటుంబీకులతో ఇంకా మాట్లాడలేదని, వారితో చర్చించిన తర్వాత నష్టపరిహారం విషయాన్ని ఎంత ఇవ్వాలో చూస్తామని చెప్పారు.
Comments
Story first published: Sunday, January 23, 2011, 13:53 [IST]