వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగీత విద్వాంసుడు భారత రత్న భీమ్‌సేన్ జోషీ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhimsen Joshi
పూణే: భారతరత్న భీమ్‌సేన్ జోషీ సోమవారం ఉదయం కన్నుమూశారు. పూణేలోని సహ్యాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. డిసెంబర్ 31వ తేదీన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గత కొంత కాలంగా వయస్సుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు 2008లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. జోషీ హిందూస్తానీ సంగీతం కిరాణా ఘరానా సభ్యుడు.

ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి. ఆయన కర్ణాటకకు చెందినవారు. భీమ్‌సేన్ జోషీ 1922 ఫిబ్రవరి 22వ తేదీన కర్ణాటకలోని గదగ్‌లో జన్మించారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే దేశభక్తి గీతంతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ఆయన హిందీ, కన్నడ చిత్రాల్లో పాటలు కూడా పాడారు. హీందోలో సంగీత ప్రధానమైన బసంత్ బిహారీ వంటి సినిమాలకు పాటలు పాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X