చవటలు, దద్దమ్మలు కాకపోతే ఏమనాలి: కాంగ్రెసు ఎమ్మెల్యేలపై కెసిఆర్
రచ్చబండను అడ్డుకోవడం ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య, ఇంకొందరు మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ ప్రాంతానికి నీళ్లేవీ? నల్గొండలో ఫ్లోరైడ్ ఎందుకుంది? అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లకు తొత్తులుగా మారి చెంచాగిరి చేసే ఇలాంటి మంత్రులు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది? అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, తెలంగాణ నాయకులంతా పార్టీలను పక్కనబెట్టి ఐకమత్యాన్ని ప్రదర్శించాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో పదివేల గ్రామాల్లో ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అది చూసైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే జిల్లాకు 10 వేలు చొప్పున లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
కె చంద్రశేఖర రావు తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు హైదరాబాద్ k chandrasekhar rao telangana congress mlas hyderabad
Story first published: Thursday, January 27, 2011, 8:48 [IST]