హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనార్టీలో ప్రభుత్వం, కాంగ్రెస్, టిడిపి లోపాయకారి ఒప్పందం: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలను బొంద పెడతారనే ఉద్దేశ్యంతో ఆయా పార్టీలు లోపాయి ఒప్పందు కుదుర్చుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, టిఆర్ఎస్ శాసనసభానేత ఈటెల రాజేందర్ గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మైనార్టీలో పడిందన్నారు. ప్రభుత్వానికి మెజార్టీ లేదని స్పష్టమవుతుందన్నారు. మైనార్టీలో ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ టిడిపి అవిశ్వాసం పెట్టడం లేదన్నారు.

అవిశ్వాసం పెట్టి ప్రభుత్వం పడిపోతే ఎన్నికలలోకి వెళ్లి తెలంగాణలో గెలవడం కష్టమనే ఆలోచనతోనే కాంగ్రెస్, టిడిపిలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అవిశ్వాసానికి దూరంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రికిగానీ, ప్రజాప్రతినిధులకుగానీ దమ్ముంటే పోలీసులు లేకుండా గ్రామాల్లోకి వెళ్లాలని సవాల్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X