వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల హత్య కేసులో జగన్‌పై సిఎం నిజాలు పీఠం కోసమే: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన పీఠం కదులుతుందనే ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య గురువారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓ ఎమ్మెల్యే హత్య కేసు ఆరోపణలనుండి రక్షించానని ఆయనే స్వయంగా చెప్పారన్నారు. పరిటాల హత్యతో జగన్‌కు సంబంధం ఉందన్నారు. అందుకే ముఖ్యమంత్రి నోటినుండి ఆ వ్యాఖ్యలు వచ్చాయన్నారు.

పరిటాల హత్య కేసులో మళ్లీ విచారణ ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ నిజాలు మాట్లాతున్నప్పటికీ అప్పుడు జగన్‌ను కాపాడినట్లుగా, ఇప్పుడు హోంమంత్రి సబితారెడ్డి కొడుకును కాపాడుతున్నారని ఆరోపించారు. పరిటాల కేసు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో పాటు పిఎం మన్మోహన్ సింగ్‌ను కూడా విచారించాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X