వైయస్ జగన్కు కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్: ఎమ్మెల్యేలతో మాటామంతీ
బుధవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంత్రి రఘువీరారెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే రవి కలిశారు. తన నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారి జోక్యం చేసుకుంటూ పరిశ్రమ పేరిట పేదల భూములు లాక్కుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రఘువీరారెడ్డి వద్ద రవి ఆవేదన వ్యక్తంచేశారు. క్వారీని ఒక పేద రైతు లీజుకు తీసుకుంటే ఆ క్వారీకి రోడ్డు లేకుండా మంత్రి అరుణ చేశారన్నారు. ఈ అంశంపై తాను న్యాయపోరాటం కోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ఆశ్రయించానని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనను కలసి జగన్ వర్గంలోకి ఆహ్వానించారని రవి చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యులేనని రవిని అనునయించారు.
Comments
Story first published: Thursday, January 27, 2011, 8:56 [IST]