నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్యసభ సభ్యులవల్లే పార్టీకి జగన్ దూరం అయ్యారు: మేకపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీచే పార్లమెంటుకు ఎన్నికైన రాజ్యసభ సభ్యులే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేశారని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో లబ్ధి పొందారన్నారు. అయితే ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తులకు తన రాజీనామాపై మాట్లాడే అర్హత లేదన్నారు. తానకు సాయం చేసిన చేతులు నరికే సంస్కృతి లేదన్నారు.

కాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జగన్ వర్గం నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను పట్టించుకేనే వారు లేరని ఆరోపించారు. సంవత్సరంన్నరగా ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. మార్చి నెలలో వైయస్ జగన్ పార్టీ పెట్టడం ఖాయమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X