హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చబండలో లోక్‌సత్తా జెపిని అడ్డుకున్న తెలంగాణవాదులు, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సత్తా అధినేత, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణను గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నిలదీశారు. జయప్రకాష్ నారాయణ కూకట్‌పల్లిలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అక్కడ ఆయనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ నుండి గెలిచిన జెపి వెంటనే తెలంగాణకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

ముషీరాబాదులో కూడా రచ్చబండ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ్యురాలు మణెమ్మను మాజీమంత్రి నాయిని నరసింహారెడ్డి పలువురు తెలంగాణవాదులతో కలిసి అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ముషీరాబాదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంత్రి ముఖేష్‌గౌడ్‌ను తెలంగాణవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డిని కూడా అడ్డుకున్నారు. రాజధాని నగరంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను తెలంగాణవాదులు అడ్డుకోవడంతో కార్యక్రమం రచ్చరచ్చ అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X