హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో అదే రచ్చరచ్చ: సిఎం సభలకు భారీ భద్రత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. శుక్రవారం సైతం తెలంగాణవాదులు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రంగారెడ్డి, నల్లగొండా జిల్లాల పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలలోని తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామాలను పోలీసులు వారి ఆదీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా పోలీసుల పహారాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా తెలంగావాదుల అరెస్టును పలువురు ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే రచ్చబండ అన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అదే ప్రజలను రాత్రికి రాత్రి అరెస్టు చేయించి రచ్చబండను నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఉదయం పది గంటలకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, మధ్యాహ్నం రెండు గంటలకు నల్గొండ జిల్లాలో సిఎం రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. కాగా వరంగల్ జిల్లా రంగశాయిపేటలో బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్యను భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ అడ్డుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు. నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల్లో అధికారులు రచ్చబండ దగ్గరకు వెళ్లకుండా ప్రజలు అడ్డకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X