మహిళలకు ఎస్ఎంఎస్‌లు పంపిన అధికారికి ప్రమోషనా: శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు అధికారులపై చేనేత మంత్రి శంకర రావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఫైర్ అయ్యారు. మహిళలకు ఎస్ఎంఎస్‌లు పంపిన పి. సీతారామాంజనేయులుకు ప్రమోషన్ ఇస్తారా అని ఆయన అడిగారు. పోలీసు బాసుల గుట్టు తనకు తెలుసునని ఆయన అన్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. పోలీసు శాఖలో బుల్లెట్ ప్రూఫ్ కుంభకోణంలో ఏం చర్యలు తీసుకున్నారని ఆయన అడిగారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మంత్రినైన తర్వాత అసలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

పోలీసుల తీరుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిఘా విభాగమే లేదని ఆయన అన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు మాఫియాతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. తనకు బెదిరింపులు వస్తే తనకే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. డిజిపి అరవింద రావుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిజిపి నుంచి పోలీసు కమిషనర్ వరకు పోలీసు అధికారులు ఏయే కుంభకోణాల్లో ఉన్నారో తనకు తెలుసునని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసు పునర్విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+