హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను జగన్ వెంటే, బాబు ఎలా ఎదిగాడు : జగన్‌తో భేటీ అనంతరం నల్లపురెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasannakumar Reddy
హైదరాబాద్: నేనెప్పటికీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉంటానని నెల్లూరు జిల్లా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మరో టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తదితరులు జగన్‌తో భేటి అయ్యారు. అనంతరం నల్లపురెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవినీతిపై పోరాటం చేయడం హస్యాస్పదం అన్నారు. 2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు 2వేల ఎకరాలకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. అనర్హత విషయమై స్పీకరు తనకు నోటీసులు పంపించినందున అడ్వకేటు ద్వారా నా వాదనలు అనర్హతపై వివరణ ఇస్తానని చెప్పారు. కాగా జగన్ పోలవరం యాత్రకు మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి కొణతాల, బాబురావు చెప్పారు. యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను వారు కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X