హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రాబుబు, జగన్ వర్గం అంబటి రాంబాబుపై మంత్రి శైలజానాథ్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత అంబటి రాంబాబు వంటి నాయకులు కూడా తమ స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి సాకే శైలజానాథ్ సోమవారం విమర్శించారు. అంబటి చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అది సరికాదన్నారు. పదవుల కోసమే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులందరిపైనా చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ అన్నారు. చంద్రబాబే అవినీతికి పెద్ద చిరునామా అన్నారు. వేలకోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డట్టు తెహెల్కా బయట పెట్టిన విషయాన్ని గుర్తుంచోకోవాలన్నారు. వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు అవినీతిపై పోరాటం చేసే హక్కు లేదన్నారు. తెహెల్కా చంద్రబాబు అవినీతిని బయట పెట్టిన విషయం ప్రజలు మరిచి పోలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X