వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవితో పొత్తా, విలీనమా త్వరలో నిర్ణయిస్తాం: అభిషేక్ సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abishek Singvi
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేక విలీనం అవుతుందా అనే విషయాన్ని పార్టీ వేదికపై నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ బుధవారం స్పష్టం చేశారు. ప్రజారాజ్యంతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఇరు పార్టీలకు ఈ విషయంపై స్పష్టత ఉందని చెప్పారు. కాకా వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నివేదికను పంపించారన్నారు. దానిని పరిశీలించిన అనంతరం కాకాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సోనియాగాంధీపై ఆరోపణలు చేసిన కాకాపై పార్టీ నిబంధనల మేరకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సింఘ్వీ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని చెప్పారు. ఆయన సోనియాపై చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయన్నారు. ఆయనకు మతిభ్రమించి అలా మాట్లాడి ఉంటారన్నారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X