సిఎం కిరణ్ రచ్చబండలో రసాభాస: వైయస్ బొమ్మ ఉంటే వద్దు

కాగా బందరు పోర్టును త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే రైతులు తమ భూములను త్యాగం చేయాల్సి ఉంటుందని సూచించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోలవరాన్ని రాజకీయం చేస్తున్నాయన్నారు. దురుద్దేశంయతో పోలవరాన్ని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని అయితే ఎవరు అడ్డుకున్నా పూర్తి చేస్తామని చెప్పారు. కొల్లేరును ఐదవ కాంటూరునుండి మూడవ కాంటూరుకు కుదిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications