ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, ఫిబ్రవరి రెండో వారం నుంచే: కెసిఆర్
వలసవాదులు దోచుకోవడానికే వచ్చారని, అయితే ఇంటి దొంగలే పెద్ద సమస్యగా మారారని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర రాజకీయ నాయకులంతా ఏకమై అడ్డుకున్నారని, తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత నాయకులు ఒక్కటి కావడం లేదని, రాజీనామాలు చేయాలంటే వెనకాడుతున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు. సమస్యలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. శంకర్ దర్సకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాను ఆయన మరోసారి ప్రశంసించారు. సినిమా చూసి సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మారుతున్నారని ఆయన చెప్పారు.
Comments
తెలంగాణ కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు హైదరాబాద్ telangana k chandrasekhar rao telangana rastra samithi congress hyderabad
Story first published: Friday, February 4, 2011, 18:25 [IST]