హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సోనియాగాంధీ నాడు లేఖ రాశారు: బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indrasena Reddy
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ ఇంద్రసేనా రెడ్డి ఆదివారం అన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని, విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా లేకుంటే అప్పుడు లేఖ ఎలా రాశారని ఆయన ప్రశ్నించారు. అయితే రెండో ఎస్సార్సీ ద్వారా తెలంగాణను, విదర్భను ఏర్పాటు చేయాలని ఆమె కేంద్రానికి సూచించారని చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి న్యూఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ ఎదుట మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడాలని సూచించారు. అలా అయితేనే కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై దిగి వస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా ఒక్కటి కావాలని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X