విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో నష్టపోయిన కాంగ్రెస్ చిరు రాకతో లాభపడుతుంది: మంత్రి బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నుండి ఓ వ్యక్తి పోవడం వల్ల కొంత నష్టం జరిగిందని, మరో వ్యక్తి రావడం వలన లాభం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడటం వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో కలవడం వలన కాంగ్రెస్ ఎంతో లాభపడుతుందన్నారు. ప్రజారాజ్యం పార్టీకి రాష్టంలో వచ్చిన 18 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావటం వల్ల రెండు పార్టీలకు లాభమని బొత్స అన్నారు. రెండు పార్టీల విలీనం పట్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతామని చెప్పారు. కాగా సింగ్‌నగర్ రచ్చబండ కార్యక్రమంలో మంత్రి బొత్సను ఇళ్ల స్థలాల కోసం స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X