ఒక వ్యక్తి చనిపోతే కాలం ఆగదు: వైయస్ మృతిపై సిఎం కిరణ్ కుమార్

విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. మోపాడు రిజర్వాయర్కు 16 కోట్లు, పాలేటిపాడు రిజర్వాయర్కు 18 కోట్ల నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు 67 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీకి 109 కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుని రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications