హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్‌కు సిఎం పదవిని ఆఫర్ చేసిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం బంపర్ ఆఫర్ చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల నేపథ్యంలో డిఎల్ కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్‌కు బంపర్ ఆఫర్ చేశారు. జగన్ చేస్తున్న ప్రజా ఉద్యమాలపై ప్రశ్నలు సంధించి వాటికి సమాధానం చెబితే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరంను ప్రారంభించారని చెబుతున్నారని అయితే పోలవరం ఏ నది మీద ఉందో, పోలవరానికి ఎవరు పునాదులు వేశారో తెలుసా అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు.

జగన్ వాటికి సమాధానం చెబితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చిరంజీవి రావడం పార్టీకి లాభమే అని చెప్పారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో చిరంజీవి ప్రచారం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు తప్పకుండా కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X