చిరు పీఆర్పీని నిమజ్జనం చేశారు, ఆయన నైతికతపై అనుమానం: దాడి

సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన వారిని మామూలుగా వదలవద్దన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపణలు చేసి వారి పంచెలూడదీసి కొట్టాలన్న చిరంజీవి ఇప్పుడు వారి పంచనే చేరి ప్రజలను వంచన చేశారన్నారు.












Click it and Unblock the Notifications