ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సామాజిక న్యాయం ఏమయింది: బిజెపి నేత వెంకయ్యనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
ఏలూరు: సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం శోచనీయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో అన్నారు. చిరంజీవి పార్టీ ఎందుకు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందన్న ఉద్దేశ్యంతోనే ఆయన పీఆర్పీని పెట్టారని గుర్తు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. అయితే చిరంజీవి ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. అందుకే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం నల్లధనం విషయంలో కొత్త పెళ్లికూతురిలా మాట్లాడుతున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X