హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీలో నాకెవరూ పోటీ కాదు, చిరుతో బలం పెరిగింది: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: సామాజిక న్యాయం నినాదంతో పార్టీ పెట్టిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం వల్ల కాంగ్రెస్‌లో మరింత సామాజిక న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సోమవారం ఢిల్లీలో అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పారు. చిరంజీవి వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడం వల్ల మా పార్టీ బలం పెరగడమే కాకుండా నాయకత్వం కూడా పెరుగుతుందన్నారు. చిరంజీవిని ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు పీఆర్పీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారన్నారు.

చిరంజీవి కాంగ్రెస్‌తో విలీనం అయ్యారు కాబట్టి తనతో వచ్చిన వారి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం కోసం వారు చిరంజీవిని ఎంతో నమ్ముకొని ఆయన వెంట ఉన్నారన్నారు. కాబట్టి వారికి సరియైన ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉందని చెప్పారు. చిరంజీవి మాకు పోటీ కాదన్నారు. మాకు మంచి బలం అన్నారు. మీకు పోటీ అని భావిస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా నాకెవరూ పోటీ కాదని సరదాగా వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X