వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత కాంగ్రెసు పార్టీ నుంచే వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

DK Aruna
మహబూబ్ ‌నగర్: రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావుకు సొంత కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మంగళవారం ఆయన పర్యటనను నిరసిస్తూ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు మిడ్జిల్ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు చెప్పకుండా కృష్ణారావు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధపడడంపై వారు ఆందోళనకు దిగారు. ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి, ఇంచార్జీ మంత్రి చెప్పినా వినకుండా కృష్ణారావు పర్యటన చేయడానికే సిద్ధపడ్డారు.

చాలా కాలంగా జిల్లాకు చెందిన మరో మంత్రి డికె అరుణకు, కృష్ణారావుకు మధ్య పడడం లేదు. దీంతో కృష్ణారావు పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెసు కార్యకర్తలు రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కృష్ణారావు పర్యటనకు పూనుకున్నారని స్థానిక కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. కృష్ణారావు పర్యటనకు సంబంధించిన ఫ్లేక్సీలను, బ్యానర్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15 మంది కాంగ్రెసు కార్యకర్తలను అరెస్టు చేశారు.

English summary
Minister Jupalli Krishna Rao is facing opposition from his own Congress party cadre at midgil of Mahaboobnagar district. Local Congress leaders criticised that minister is touring in this area without informing them. so, they decided to obstruct Minister's tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X