హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదవులు తీసుకుంటాం, తెలంగాణ కేంద్రం పరిధిలో: పీఆర్పీ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవి నిర్ణయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతించారు. పార్టీ విలీనం తర్వాత మంగళవారం మొదటిసారి హైదరాబాద్ వస్తున్న చిరంజీవికి స్వాగతం పలకడానికి ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలంగాణకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్యే అనీల్‌కుమార్ అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందువల్ల తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి తన ఆశయాలు సాధిస్తారని మరో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రెండున్నరేళ్లలో చిరంజీవి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని వాటన్నింటినీ తట్టుకున్నారన్నారు. చిరంజీవి కొందరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని తట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదన్నారు. ప్రజాకర్షణ, క్లీన్ ఇమేజ్ చిరంజీవి బలం అని మరో ఎమ్మెల్యే అన్నె రాంబాబు అన్నారు. మంత్రి పదవులు ఇస్తే తీసుకుంటామన్నారు. అయితే పదవులు రాకున్నా ఫరవాలేదని స్పష్టం చేశారు.

English summary
PRP MLAs said Chiranjeevi's clean image will work out in 2014 election and Congress will come into power. MLA Anil Kumar said Telangana issue is in central government hand. Another MLA Bandaru Satyananda Rao said Chiru will fulfill his targets in Congress. He said there is no chance to group politics. If High Command will give posts, they will take, said MLA Anne Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X