తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి సబ్ జైలులో ఖైదీ అనుమానాస్పద మృతి, ఆర్డీవో విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirupati
తిరుపతి: తిరుపతి సబ్ జైలులో ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి జరిగింది. తీవ్రమైన గాయాలతో వెంకట రమణాచారి అనే ఖైదీని జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శవానికి పోస్టు మార్టం జరుగుతోంది. సంఘటనపై ఆర్డీవో విచారణ జరుపుతున్నారు. బ్యారక్‌లో తోటి ఖైదీలు అతన్ని చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాత్రూంలో పడిపోయి వెంకట రమణాచారి మరణించినట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు.

భార్యను హత్య చేసిన కేసులో వెంకటరమణాచారికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2007 ఏప్రిల్ 15వ తేదీన అతను తన భార్యను హత్య చేసినట్లు కోర్టులో నిరూపితమైంది. జైలు శిక్ష పడిన వెంకటరమణాచారిని రాష్ట్రంలోని ఏదైనా కేంద్ర కారాగారానికి పంపాల్సి ఉంది. అయితే, అతన్ని ఎందుకు కేంద్ర కారాగారానికి పంపించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

English summary
Suspicious death in Tirupati sub - jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X