వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతకాకుంటే దిగిపోండి: ఢిల్లీ ధర్నాలో విరుచుకుపడ్డ చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: కాంగ్రెసు ప్రభుత్వానికి పాలించడం చేతకాకుంటే వెంటనే దిగి పోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం థర్డ్‌ఫ్రంట్ ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెసు పార్టీ దేశంలో అవినీతిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ఏడేళ్లుగా కాంగ్రెసు పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉందన్నారు. యూపీఎ పాలనలో ఉల్లి నుండి ఇంటి అద్దె వరకు అన్నింటి ధరలు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వ్యవసాయంపై కేంద్రం దృష్టి పెట్టక పోవడం వలన ఆహార సమస్య నెలకొనే ప్రమాదం పొంచి ఉందన్నారు.

పెట్రో ధరలు చాలాసార్లు పెంచి ప్రజలను వంచించిందన్నారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించకుంటే దిగిపోవాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని చెప్పారు. ప్రభుత్వాలను రక్షించుకోవడానికి వాటిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఎబి బర్దన్, అజిత్‌సింగ్, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్ తదితరులు పాల్గొన్నారు.

English summary

 TDP state president Chandrababunaidu fired at Congress corruption in Third Front Dharna which is held in New Delhi today. He accused that from onion to house rent all rates are raised in Congress Government. Ex Prime Minister Deve Gowda, seetharam Achuri, Bardhan..participated in this dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X