దివంగత వైయస్ఆర్ హయాంలోనే అవినీతి...: చిరంజీవి, డి శ్రీనివాస్

ఇప్పటినుండి నేను కాంగ్రెసులో ఒక్కణ్ణని, ఆ కుటుంబ సభ్యులలో ఒక్కణ్ణని చెప్పారు. అందరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. పార్టీ విలీనం ప్రక్రియ మరో నెల రోజులు పడుతుందన్నారు. ఆ తర్వాత విలీనం సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుండి కాంగ్రెసులో మా నాయకుడు, మీ నాయకుడు అని కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి జరిగిందని చెప్పారు. అయితే అవినీతి ఎవరి హయాంలో జరిగినా ప్రక్షాళన చేయాల్సిందేనన్నారు. కాంగ్రెసు సభ్యునిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పట్ల రాష్ట్రంలోని అట్టడుగు బలహీన వర్గాలతో పాటు ఇరుపార్టీల కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారని డిఎస్ అన్నారు. అందరం కలిసి కాంగ్రెసు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని చెప్పారు. చిరంజీవి అందరితో ఏకమై పని చేస్తారని చెప్పారు. చిరు ఇకనుండి కాంగ్రెసు నేత అన్నారు. చిరు వైయస్ హయాంలో అవినీతి జరిగిందన్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కడో ఒకచోట అవినీతి జరుగుతుందన్నారు. అయితే వాటిపై దృష్టి సారిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications