హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు కొండా సురేఖ దంపతులు షాక్, హైకమాండ్‌తో రాజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు వ వైయస్ జగన్‌తో తెగదెంపులు చేసుకునేందుకు పూనుకున్నారు. గత 15 రోజులుగా కొండా సురేఖ జగన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సమయంలో కొండా సురేఖ దంపతులు విడతలు విడతలుగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రాజీకి సిద్ధపడిన విషయాన్ని డిఎస్ ఓ ముఖ్యనేత ద్వారా పార్టీ అధిష్టానానికి డిఎస్ తెలియజేసినట్లు సమాచారం.

రాజీకి సిద్ధపడడంతో సస్పెన్షన్ జాబితా నుంచి కొండా సురేఖ పేరును డిఎస్ తొలగించినట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా వారు జగన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. వ్యాపార లావాదేవీల వల్లనే జగన్‌తో తెగదెంపులు చేసుకోలేకపోయామని సురేఖ దంపతులు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంతో పాటు వరంగల్‌ జిల్లాలో ఏకాకులు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో కొండా దంపతులు జగన్ వెంట వెళ్లాలనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దంపతులకు మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న విభేదాలను తొలగించడానికి డిఎస్ ఆసక్తి చూపినట్లు సమాచారం.

English summary
It is learnt that Congress MLA Konda Surekha decided to take u - turn and distance herself from YS Jagan. In a bid to avoid suspension, she is in touch with PCC president D Srinivas. She informed DS that she will continue in congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X