ఎంపీ సీటు ఇస్తానని చిరంజీవి రూ.2 కోట్లు ముంచాడు: నర్రా
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
చేవెళ్ల
పార్లమెంటు
సీటు
ఇస్తానని
చెప్పి
తన
వద్ద
రెండు
కోట్ల
రూపాయలు
తీసుకొని
తనను
చిరంజీవి,
ఆయన
బావమరిది
అల్లు
అరవింద్
మోసం
చేశారని
నర్రా
విజయలక్ష్మి
అనే
మాజీ
ప్రజారాజ్యం
పార్టీ
నేత
బుధవారం
ఆరోపించారు.
సీటు
ఇస్తానంటే
2కోట్ల
రూపాయలను
అల్లు
అరవింద్కు
ఇచ్చానని
చెప్పారు.
అయితే
ఆ
సీటు
తనకు
ఇవ్వకపోగా
రెండు
సంవత్సరాలు
కావస్తున్నా
తన
డబ్బు
తనకు
ఇవ్వలేదన్నారు.
చేవెళ్ల
సీటును
కాసాని
జ్ఞానేశ్వర్కు
ఇచ్చారని
చెప్పారు.
చిరంజీవి
తన
డబ్బులను
ఈ
నెల
15వ
తేది
లోపు
ఇవ్వాలని
డిమాండ్
చేశారు.
లేదంటే
16వ
తేదిన
తాను
ఆమరణ
నిరాహార
దీక్షకు
దిగుతానని
హెచ్చరించారు.
చిరంజీవి
ఏ
సామాజిక
న్యాయం
అని
చెబుతూ
మహాత్మాగాంధీ,
అంబేడ్కర్,
థెరిస్సా
ఫోటోలు
పెట్టుకున్నారో
ఆ
విగ్రహాల
ముందే
ఆమరణ
నిరాహార
దీక్షకు
దిగుతానన్నారు.
తనకు
సీటు
ఇవ్వక
పోవడంతో
తన
డబ్బులు
తనకు
తిరిగి
ఇవ్వాలని
అడగటంతో
పీఆర్పీ
అధికారంలోకి
వస్తుందని,
చైర్మన్గానీ,
ఎమ్మెల్సీ
పదవిగానీ
ఇస్తానని
హామీ
ఇచ్చారని
చెప్పారు.
అయితే
పీఆర్పీ
అధికారంలోకి
రాకపోయినప్పటికీ
డబ్బులు
తిరిగి
ఇవ్వలేదని
చెప్పారు.
చిరంజీవి
రాజకీయాలలోకి
వచ్చింది
ప్రజా
సేవ
చేయడానికి
కాదని
డబ్బులు
దోచుకోవడానికన్నారు.
వారికి
ప్రజా
సేవ
చేయడమే
రాదన్నారు.
చిరంజీవి
మోసంపై
ఏఐసిసి
అధ్యక్షురాలు
సోనియాగాంధీకి
ఈమెయిల్
చేస్తానని
చెప్పారు.
చిరు
డబ్బులు
ఇవ్వకుంటే
ఇకనుండి
ప్రత్యక్ష
యుద్ధానికి
దిగుతానని
చెప్పారు.
డబ్బులు
సంపాదించుకోవడానికే
చిరంజీవి
కాంగ్రెస్
పార్టీలో
చేరారని
ఆరోపించారు.
చిరు
నాలా
ఎవరినీ
మోసం
చేయకూడదనే
బయటకు
వచ్చానని
చెప్పారు.
పార్టీ
కేంద్రంలో,
రాష్ట్రంలో
అధికారంలో
ఉంది
కాబట్టి
మరింత
సంపాదించుకోవచ్చునని
వాళ్లు
ఆలోచిస్తున్నారని
ఆరోపించారు.
PRP ex leader Narra Jayalaxmi fires at Chiranjeevi today. She alleged that Chiru's brother-in-law Allu Aravind took Rs 2 crores for Lokasabha ticket. She warned, If Chiru will not return her money, she will go on fast.
Story first published: Wednesday, February 9, 2011, 15:17 [IST]