2జి స్కామ్ డబ్బులతో మాకు సంబంధం లేదు: డిఎంకె చానెల్
National
oi-Pratapreddy
By Pratap
|
చెన్నై:
2జి
స్కామ్
కుంభకోణం
డిఎంకె
చానెల్
కలైంగర్కు
చుట్టుకుంటోంది.
ముఖ్యమంత్రి
కరుణానిధి
కుటుంబానికి
చెందిన
టీవీ
చానెల్లోకి
టెలికం
మాజీ
మంత్రి
ఎ
రాజా
తీసుకున్న
లంచం
డబ్బులు
పెట్టుబడిగా
మళ్లాయనే
ఆరోపణలు
వస్తున్నాయి.
2జి
స్కామ్లో
రాజాకు
200
కోట్ల
రూపాయల
లంచం
అందినట్లు
సిబిఐ
విశ్వసిస్తోంది.
వాటిని
కలైంగర్
టీవీలో
2009లో
పెట్టుబడులుగా
పెట్టినట్లు
ఆరోపణలు
వస్తున్నాయి.
ఈ
టీవీ
చానెల్లో
కరుణానిధి
భార్య
దయాలుమ్మాళ్కు
60
శాతం,
కూతురు
కనిమొళికి
20
శాతం
వాటాలున్నాయి.
డిబి
రియాల్టీ
అండ్
స్వాన్
టెలికం
ప్రమోటర్
షాహిద్
బాల్వా
రాజాకు
ఆ
డబ్బులు
లంచంగా
ఇచ్చినట్లు
ఆరోపణలు
వస్తున్నాయి.
రాజా
హయాంలో
విపరీతంగా
ప్రయోజనం
పొందిన
రెండు
కంపెనీల్లో
ఇది
ఒకటి.
బాల్వాను
సిబిఐ
మంగళవారం
ముంబైలో
అరెస్టు
చేసింది.
డబ్బులు
డిబి
గ్రూప్
ద్వారా
చెన్నై
చేరడానికి
ఈవెంట్
మేనేజ్మెంట్
కంపెనీ
సినీయుగ్ను
వాడుకున్నట్లు
తెలుస్తోంది.
సినీయుగ్
ద్వారా
డబ్బులు
కలైంగర్
టీవీ
చానెల్కు
చేరాయని
అంటున్నారు.
అయితే,
2జి
స్కామ్తో
తమకు
ఏ
విధమైన
సంబంధం
లేదని
కలైంగర్
టీవీ
స్పష్టం
చేస్తోంది.
సినీయుగ్
తమ
సంస్థలో
ఇంతకు
ముందు
పెట్టుబడులు
పెట్టిందని,
వాల్యుయేషన్
తేడా
వల్ల
200
కోట్ల
రూపాయలను
రుణంగా
పరిగణించామని,
ఆ
మొత్తాన్ని
వడ్డీతో
సహా
2009లో
తిరిగి
చెల్లించామని
చెబుతోంది.
లావాదేవీలో
ఏ
విధమైన
అక్రమం
లేదని,
అన్ని
నిబంధనలను
పాటించామని,
ఈ
విషయం
ఆదాయం
పన్ను
శాఖకు
తెలుసునని
వివరించింది.
The investigation into the 2G scam seems to be snaking its way to the front door of the DMK. The CBI is connecting the dots between former Telecom Minister A Raja and the companies he allegedly colluded with; the dotted line seems to suggest that the kickbacks paid to Mr Raja were routed into a TV channel owned by the first family of the DMK. The channel has, however, denied any link to the scam.
Story first published: Friday, February 11, 2011, 11:17 [IST]