వైయస్ జగన్ పోలవరం హరిత యాత్రపై రేవంత్ రెడ్డి మండిపాటు
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వైయస్ జగన్ హరిత యాత్ర చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఇచ్చి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కనీసం జగన్ తన నియోజకవర్గంలోనైనా గెలుస్తారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల కాలువలు మాత్రమే తవ్వి కాలువల్లో అవినీతిని పారించిన వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్ను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గొర్రెకు, కుక్కకు తేడా ఏమిటో కూడా జగన్కు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు ఆయన పిట్ట కథ చెప్పారు. వైయస్ జగన్ పత్రికలను తప్పు పడితే తమకు అభ్యంతరం లేదని, కానీ తెలుగుదేశంపై బురద చల్లితే సహించబోమని ఆయన అన్నారు.
Comments
రేవంత్ రెడ్డి తెలుగుదేశం వైయస్ జగన్ పోలవరం హైదరాబాద్ revanth reddy telugudesam ys jagan polavaram hyderabad
English summary
Telugudesam leader Revanth Reddy lashes out at YS Jagan's haritha yatra. He alleged that YS Jagan has earned crores of rupees misusing his father YS rajasekhar Reddy's Government. Jagan should spend his illegal earnings to complete irrigation projects in the state.
Story first published: Friday, February 11, 2011, 14:55 [IST]