వైయస్ జగన్ టీమ్: అంబటి రాంబాబు, భూమనలకు పెద్ద పీట
నల్లగొండ జిల్లాకు ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిని, మెదక్ జిల్లాకు కె. కె. మహేందర్ రెడ్డిని, కడప జిల్లాకు బాలరాజును, కర్నూలు జిల్లాకు నలిమిల్లి శేషారెడ్డిని, విజయనగరం జిల్లాకు అత్తిలి రంగరాజును, తూర్పు గోదావరి జిల్లాకు ఇందుకూరు రామకృష్ణ రాజును, గుంటూరు జిల్లాకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, నెల్లూరు జిల్లాకు బాలినేని శ్రీనివాస రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు జాడ కృష్ణ మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు అమర్నాథ్ రెడ్డిని, విశాఖపట్నం జిల్లాకు భూమా నాగిరెడ్డిని, శ్రీకాకుళం ఆళ్ల నానిని, చిత్తూరు జిల్లాకు మేకపాటి చంద్రశేఖర రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించినట్లు సమాచారం.
కాగా, నిజామాబాద్ జిల్లాకు గోనె ప్రకాశ రావును, రంగారెడ్డి జిల్లాకు జూపూడి ప్రభాకరరావును, ఆదిలాబాద్ జిల్లాకు రెహ్మాన్ను, వరంగల్ జిల్లాకు బాజిరెడ్డి గోవర్దన్ను, మహబూబ్నగర్ జిల్లాకు గట్టు రామచంద్రరావును, అనంతపురం జిల్లాకు శోభా నాగిరెడ్డిని, హైదరాబాద్ జిల్లాకు జనక్ ప్రసాద్ను వైయస్ జగన్ సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది.