రామోజీరావుపై మళ్లీ యుద్ధం ప్రారంభించిన ఎంపీ ఉండవల్లి అరుణ్

నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన దువ్వూరిని కోరారు. గతంలోనే తాను మార్గదర్శిపై ఆర్బిఐ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉండవల్లి నాలుగు పేజీల లేఖను దువ్వూరికి ఇచ్చారు. ఉండవల్లి అరుణ్కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రామోజీరావును లక్ష్యంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అయితే వైఎస్ మరణం అనంతరం ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ రామోజీరావుపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.












Click it and Unblock the Notifications