జగన్‌పై పోటీకి నర్రెడ్డి: సోనియాను అడగనున్న వైయస్ వివైకానంద

YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: తన అల్లుడికి కడప పార్లమెంటు సీటు ఇవ్వవలసిందిగా కోరేందుకు వ్యవసాయ శాఖామంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కడప జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా దింపాలనే యోచనలో వివేకా ఉన్నారు. ఈ విషయంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నుండి అనుమతి పొందేందుకు ఆయన తన అల్లుడు నర్రెడ్డితో పాటు ఢిల్లీ చేరినట్లుగా తెలుస్తోంది. వివేకా శాసనమండలి సభ్యత్వం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన పులివెందుల నుండి దివంగత వైయస్ సతీమణి విజయమ్మపై పోటీకి సన్నద్దమయ్యారు. కడప పార్లమెంటు సభ్యత్వానికి జగన్‌పై పోటీకి కూడా తన అల్లుడిని రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ఢిల్లీలో ప్రముఖ నేతలతో అల్లుడిని పరిచయం చేసే ఉద్దేశ్యంలో కూడా వివేకా ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా జగన్‌ను ఎదుర్కొనాలంటే వైయస్ కుటుంబ సభ్యుడు అయిన తన అల్లుడు నర్రెడ్డియే సరియైన అభ్యర్థి అని సోనియాకి చెప్పి ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వైయస్ ప్రాబల్యం ఉన్న కడపలో మరెవరిని పోటీకి నిలిపినా పార్టీ నష్టపోయే అవకాశముందని సోనియాకు నచ్చజెప్పవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందు వలన గెలిచే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+