వైఎస్ జగన్ ఫీజు పోరు దీక్షకు టిఆర్ఎస్ పరోక్ష మద్దతు?
ఇందులో భాగంగా శుక్రవారం నుండి హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద జగన్ ప్రారంభించిన దీక్షకు టిఆర్ఎస్ అనుబంధ విభాగం అయిన టిఆర్ఎస్వి సమీకరించే బాధ్యత తీసుకున్నట్టుగా టిడిపి భావిస్తున్నట్టు సమాచారం. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతంర టిడిపిఎల్పీలో ఈ దీనిపై చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని కూడా వారు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టుకు వచ్చిన టిఆర్ఎస్, సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకున్న జగన్కు పరోక్ష మద్దతు పలకడానికి కారణం ఇప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయంగా బాగుపడుతామనే భావనతో ఉన్నందువల్ల అని తెలుస్తోంది.
అయితే టిడిపి, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ రాజకీయ అజెండాతో పని చేయాలని నిత్యం డిమాండ్ చేస్తూ తెలంగాణవారిని రెచ్చగొడుతున్న టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాత్రం తెలంగాణ ఎజెండాతో పార్టీ పెట్టి రాజకీయ లాభం కోసం ఇప్పుడు జగన్తో కలవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్ అధికారంలోకి వస్తాడని, కెసిఆర్ ప్రతిపక్షంగా ఉంటారని తమ సర్వేలో తేలినట్లు వచ్చిన వార్తలు కూడా శుద్ద అబద్దమని, ప్రజలను, ఆయా పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికే ఇలాంటి అబద్దపు సర్వేలు చేయించుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.