హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జై తెలంగాణ అనకుంటే జగన్‌నూ అడ్డుకుంటాం: హరీష్‌ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్‌రావు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పలు సమస్యలపై తెలంగాణకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. గతంలో కూడా ఇలాంటి హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చుకోలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన హామీని నెరవేర్చుకోవాలని కోరారు. తెలంగాణ వారికి పదవులు కల్పించాలని కోరారు. ఆదివారం కురిసిన వర్షాలకు మామిడి తదితర పంటలు తెలంగాణ ప్రాంతం వారు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారిని కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

అసెంబ్లీలోనే కాకుండా అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా పోలీసులతో దిగ్బంధం చేశారని, ఇలా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్దకు ప్రజలను స్వేచ్ఛగా వెళ్లేందుకు కూడా వెళ్లనివ్వడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్నారు. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి పోయిందని చెప్పిన వారు టిఆర్ఎస్‌పై అబాండం వేయడం ఏమిటని ప్రశ్నించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వరంగల్ వచ్చినప్పుడు అడ్డుకున్నామని, అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరని, ఎంపీ కాదని, ఆయన పార్టీ కూడా పెట్టలేదని అందుకే ఇప్పుడు ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయన పార్టీ పెట్టి జై తెలంగాణ అనకుంటే అప్పుడు అడ్డుకుంటామని హెచ్చరించారు.

English summary
TRS Siddipet MLA T Harish Rao warned Ex MP YS Jaganmohan Reddy that they will obstruct YS Jagan if he opposes Telangana after announcing party. He said CM gave promise to solve all problems of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X