గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెసు తెలంగాణ ఎంపి మధుయాష్కీ ఫైట్

Madhu Yashki
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై పోరాటానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ శాసనసభ్యులను అసభ్య పదజాలంతో తిట్టిన గవర్నర్‌పై తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గవర్నర్ పోలీసు లాగా వ్యవహరిస్తూ తెలంగాణ ఆందోళనకారులపై పోలీసులను ప్రయోగించేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఆయన ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+