వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెసు తెలంగాణ ఎంపి మధుయాష్కీ ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై పోరాటానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ శాసనసభ్యులను అసభ్య పదజాలంతో తిట్టిన గవర్నర్‌పై తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గవర్నర్ పోలీసు లాగా వ్యవహరిస్తూ తెలంగాణ ఆందోళనకారులపై పోలీసులను ప్రయోగించేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఆయన ఖండించారు.

English summary
Madhu Yashki from Nizamabad has decided to fight against Governor Narasimhan. He said that he will complain against Governor, who used unparliamentary words against Telangana MLAs to centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X