చంద్రబాబు నాయకుడే కారా?, ధ్వజమెత్తిన వివిధ పార్టీల నేతలు
కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జగన్పైకి తెలంగాణవాదులను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది నీచ రాజకీయమని ఆయన అన్నారు. తెరాస నాయకుడు జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చంద్రబాబు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్తో, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుతో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు తన వ్యతిరేక వైఖరిని మరోసారి ప్రదర్శించుకున్నారని ఆయన విమర్శించారు.
ఇదిలా వుంటే, చంద్రబాబు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని అనుకుంటుండడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన పరుష పదజాలం వాడారు. తాను చెప్పేది వినాలని ఆగ్రహించారు.