తెలంగాణకు పరిష్కారం కన్నా పార్టీ రక్షణకే చంద్రబాబు ప్రాధాన్యం
మిగతా పార్టీలు పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, అటువంటప్పుడు తామెందుకు ఆ ప్రయత్నాలు చేయకూడదని ఆయన అన్నారు. పార్టీని కాపాడుకోవడానికే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రదర్సించదలుచుకోలేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తే సహించేది లేదని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు శాసనసభను స్తంభింపజేస్తుంటే ఆయన చూస్తూ కూర్చుంటున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులను మాట్లాడనివ్వడం లేదనే విమర్శ వస్తోంది. మొత్తం మీద, భారమంతా కేంద్రంపైకి నెట్టేసి ఆయన పార్టీని కాపాడుకునేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ సమైక్యాంధ్ర హైదరాబాద్ chandrababu naidu telugudesam telangana united andhra hyderabad
English summary
TDP president Chandrababu is not ready to change his working style. He is allowing to opinions to prevail in party on Telangana issue. He said that it is important to protect party interests than solving Telangana issue.
Story first published: Tuesday, February 22, 2011, 16:59 [IST]