జగన్ టిఆర్ఎస్ పరస్పర సహకారం: టిడిపి అధినేత చంద్రబాబు

అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి, రాష్ట్రంలో బందులు తదితర పరిణామాలన్నింటికీ కాంగ్రెసు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగువారి కోసమన్నారు. కేవలం రాష్ట్రంలోని వారి కోసమే కాదని, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగక పోవడం విచారకరమన్నారు. సమస్యలను దాటవేసే ధోరణిలో ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. బాధ్యతను విస్మరించి కేంద్రం ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. చర్చలేకుండా తీర్మానం ఆమోదించే పద్దతికి అధికార పక్షం శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్రం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు స్థంభిస్తున్నాయి. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కొంతమందికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్నారు. అయితే అవి పార్టీ అభిప్రాయాలు కావాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications