రేపు స్పీకరు పోడియం ముందు బైఠాయిస్తాం: కెసిఆర్

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్రం ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మంగళవారం హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాలలో పాల్గొన్న ఆయన అనంతరం మరో ఎంపీ విజయశాంతితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్పీకర్ మీరాకుమార్‌కు తెలంగాణ అంశంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చామని చెప్పారు. జీరో అవర్‌లో అవకాశం ఇస్తామంటే వద్దని చెప్పామని, అయితే రేపు మాట్లాడటానికి అవకాశం ఇస్తామని చెప్పారు. పార్లమెంటులో మా సహకారం కూడా అవసరం కాబట్టి ఊరుకున్నామన్నారు. రేపు చర్చించకుంటే స్పీకరు పోడియం ముందు బైఠాయిస్తామని చెప్పారు. తెలంగాణ అంశం తేలాల్సింది ఇక్కడే, తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి పార్లమెంటులో పట్టుబడతామని చెప్పారు. ప్రతిపక్షాలతో కలిపి అందోళన చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగులు వారం రోజులనుండి సహాయ నిరాకరణ చేస్తున్నా, న్యాయవ్యవస్థ స్థంభించిపోయినా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, అలా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకూడదని, ప్రధానితో చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. అది ఎవరికీ శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు గతంలో కేంద్రం ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉండమని చెబుతున్నారని, అంతకంటే ఎక్కువ ఏమీ కోరడం లేదన్నారు. 120 కోట్ల ప్రజల సాక్షిగా ఇచ్చిన ప్రకటనను కేంద్రం నీరుగార్చడం సబబు కాదన్నారు. శాసనసభ కూడా స్థంభిస్తుందని, ప్రజలు అన్నింటా సహాయ నిరాకరణ చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. తెలంగాణ జెఏసి సమావేశంలో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+