తెలంగాణ అంశాన్ని లోకసభలో ప్రస్తావించిన కెసిఆర్

తెలంగాణ తీర్మానం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించాలని కెసిఆర్ అంతకు ముందు మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు. నాలుగు లక్షల మంది సహాయ నిరారణలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. తాను వాయిదా తీర్మానం ప్రతిపాదించానని, దాన్ని అనుమతించకపోతే స్పీకర్ పోడియం వద్ద బైఠాయిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులతో కేంద్రానికి నివేదిక సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు కట్టుబడాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications