హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో పరిస్థితికి చంద్రబాబు, సోనియాగాంధీ కారణం: కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత పరిస్థితికి కారకులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి మంగళవారం మీడియా పాయింట్ వద్ద అన్నారు. అసెంబ్లీని ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ 15 నిమిషాలు వాయిదా వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలోని పదిజిల్లాల ప్రజలు తెలంగాణను ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితికి సోనియా, చంద్రబాబులే కారణమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రభుత్వం ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియ ప్రారంభించకుండా అణిచివేయడం ఎంత వరకు సమంజసం అని ప్రదర్శించారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తుంటే ప్రభుత్వానికి మాత్రం అది కనిపించడం లేదన్నారు. ప్రపంచంలో అనేక ఉద్యమాలు చూశామని, అన్ని ప్రజా ఉద్యమాలు విజయం సాధించాయన్నారు. రాష్ట్రంలో జెఏసి ఇచ్చిన 48 గంటల బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరుగుతుందన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే మాత్రం సరికాదన్నారు. బంద్‌కు అందరూ సహకరించాలన్నారు. తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతుంటే కేవలం పోలీసుల డిపార్టుమెంట్ మాత్రమే ఓవర్ యాక్షన్ చేస్తుందన్నారు. సిఎం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం పోలీసు డిపార్టుమెంట్ ఒక్కటే పని చేస్తుందన్నారు.

English summary
BJP MLA Kishan reddy blamed today AICC president Sonia Gandhi and TDP president Chandrababu for the present situation in Telangana. He accused Police department over action in bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X