తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను అరెస్టు చేసిన పోలీసులు

కేంద్రానికి ఒక్క గొంతుకతో రాష్ట్ర ఆకాంక్షను తెలపాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారన్నారు. బంద్లో ఎలాంటి బలవంతం లేదన్నారు. ప్రశాంతంగా అందరూ నిర్వహించాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రజలు ఎదురు చూశారని, వారి ఆశలు నెరవేరే అవకాశం రాకపోవడంతో ఉద్యమానికి పూనుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ మరింత బాధించిందన్నారు. కాగా పలువురు ఆందోళనకారులు తార్నాకలోని పెట్రోల్ బంకును దగ్ధం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం మీడియా ప్రతినిధులపై పోలీసుల అమానుష ప్రవర్తనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications