వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే తెలుగుదేశం అధ్వాన్నంగా ఉంది: ఎంపీ లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యవహార శైలి బాగా లేదని అందుకే తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రంలో చాలా అధ్వాన్నంగా ఉందని మంగళవారం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ధ్వజమెత్తారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ రాదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయం కుదిరితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో పార్టీలు మొదట ఏకాభిప్రాయం వ్యక్తం చేయాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే తెలుగు వారి విషయానికి వచ్చే సరికి చేతులు ఎత్తి వేయటం సమంజసమా అన్నారు.

కేంద్రమంత్రి చిదంబరం గత డిసెంబర్ 9న కేంద్రం తరఫున ప్రకటన చేయలేదన్నారు. రాష్ట్ర పార్టీలు తెలంగాణపై చేసిన నిర్ణయానికి ఆమోదపూర్వక ప్రకటన మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు నిత్యం ప్రకటన ఆర్ధరాత్రి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని, అయితే ప్రకటన ఎప్పుడు చేస్తే ఏమిటని, అది సరైనదా, కాదా నిర్ణయం చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పేరుకే సార్థగత లేకుండా పోతోందన్నారు. తెలంగాణ కోసమో మరెందుకోసమో ఒక్కరు రాజీనామా చేస్తే సరిపోదన్నారు. కులం, మతం, ప్రాంతం బేధాలు తనకు లేవన్నారు. 2014 ఎన్నికల వరకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకి వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్సు గురించి ప్రశ్నిస్తున్నవారు గత రెండేళ్లనుండి తమకు ఫీజులు చెల్లించలేదని ఏ విద్యార్థి అయినా అడిగారా అని, ప్రతిపక్షాల సృష్టి అని చెప్పారు.

English summary
Vijayawada Parliament Member Lagadapati Rajagopal blamed TDP president Chandrababu on seperate Telengana issue. He hoped that Ex MP YS jaganmohan Reddy will return to Congress in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X